తెలుగులో బ్లాగు రాయడం వలన ఎంత లాభం పొందాను అన్నది ఒక పెద్ద ప్రశ్న?
అయితే, వందల గంటలను వెచ్చించడం వల్ల భాష పరిజ్ఞానం అన్నది కొంత పెరిగింది.
…లేకపోతే, ఇంగిలిపీసు సదువులకు మొత్తం బూడిదపాలయ్యేది.
బతుకు తెరువు కోసం పోరాటాలు చేసేవారికి, సంసారంలో నిండా మునిగిన వారికి,
తెలుగు భాష సాధన,శోధన పెద్దగా లాభాలు పండించే విద్య కాదన్నది చేదు నిజం!
నేడు తెలుగులో రాసుకోవాలంటే, ఒక స్థాయిలో ఆశయం/సంకల్పం ఉండటం అవసరం.
మన జీవితానికి, మన రాతలకు ఎంత దూరం ఉంటే, మనసులో అంత రాపిడి,
ఎంత దగ్గరగా ఉంటే అంత ఆనందాన్ని పొందుతాము అనుకుంటాను.
లేకపోతే పూర్తిగా కామెంట్ల సంతృప్తితోనే ఆ లోటును భర్తీ చేసుకోవాల్సి వస్తుంది… కావచ్చు.
బ్లాగులు రాయడం వల్ల ప్రాపంచికంగా పెద్దగా పొందక పోయినా,
జీవితానికి పనికి వచ్చేది, ఆధ్యాత్మికంగా ఒకటి మాత్రం తప్పకుండా పొందుతాము.
మన ఆలోచనలను పరిశీలించి, మనను మనం అర్ధం చేసుకోవడంలో ఒక మెట్టును ఎక్కడం.